AP: Neerabh
Kumar Prasad Appointed as The New Chief Secretary
ఏపీ: నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (CS) నీరభ్ కుమార్ ప్రసాద్ నియామకం
===================
UPDATE 27-06-2024
AP: సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ
ఏపీ రాష్ట్ర సీఎస్
గా నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు
డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
===================
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా
సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు
జారీ అయ్యాయి. 1987 బ్యాచ్ కు చెందిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా
పనిచేస్తున్నారు.
ఇప్పటి వరకు సీఎస్ గా ఉన్న కె.ఎస్. జవహర్ రెడ్డి గురువారం
సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో నూతన సీఎస్ నియామకం జరిగింది. కొత్త సీఎస్ నియమాకం
జరిగినందున జవహర్ రెడ్డి ని బదిలీ చేశారు. బుధవారం ఉదయం తెదేపా అధినేత చంద్రబాబును
నీరబ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు.
===================
===================
0 Komentar