TG DSC-2024: 8 Member
Selected as Govt Teachers from Same Village – Details Here
ఒకే గ్రామం నుంచి
8 మంది డీఎస్సీ-2024 తో ఉపాధ్యాయులుగా ఎంపిక - నలుగురు
అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు – వివరాలు ఇవే
======================
ఒకేసారి ఒక గ్రామం
నుండి నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు (మొత్తం
8 మంది) ఉపాధ్యాయ నియామాక పత్రాలను అందుకున్నారు. వరంగల్
జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన 8మంది విద్యార్థులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన
డీఎస్సీలో ఎంపిక నియామక పత్రాలు అందుకున్నారు.
గ్రామస్థుల సన్మానం:
తమ గ్రామం
నుంచి ఒకేసారి ఎనిమిది మందికి టీచర్ ఉద్యోగాలు రావడంతో దసరా పండుగ వేళ వారి సంబరం
మరింత పెరిగింది. తమ ఊరికి ఇంత పేరు తీసుకొచ్చిన 8 మంది ఉపాధ్యాయులను, వారి తల్లిదండ్రులను
గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.
గత పది సంవత్సరాలుగా ఈ ఉద్యోగం కోసం ఎదురు చూశామని నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎలాగైనా ఉద్యోగం సాధించాలని శ్రమించామని, తమ కష్టానికి ఫలితంగా ఎనిమిది మందికి ఉద్యోగాలు రావడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయ విజేతలు అన్నారు. మా తల్లిదండ్రులు, గ్రామస్తులు ప్రోత్సాహం మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చిందన్నారు. అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే చిన్నారులను ఉత్తమమైన విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.
"నేను గత పదేళ్లుగా టీచర్ జాబ్కోసం ప్రయత్నిస్తున్నాను. 2017లో ఒకసారి పరీక్షకు హాజరైనప్పటీకీ ఉద్యోగం సాధించలేకపోయాను. ఈ సారి మరింత పట్టుదలతో చదివి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం జరిగింది. నా విజయంలో గ్రామస్థులు, తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. ఇక్కడితో ఆగకుండా గ్రూప్-2, గ్రూప్-1 లాంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతాను".
- మహేష్, ఉపాధ్యాయుడు
======================
0 Komentar