Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Budget 2025-26: శాసనసభలో బడ్జెట్‌ కేటాయింపు లోని ముఖ్యాంశాలు ఇవే

 

AP Budget 2025-26: శాసనసభలో బడ్జెట్‌ కేటాయింపు లోని ముఖ్యాంశాలు ఇవే

=====================

ఏపీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు.

రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు, ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్లో రూ.6,705 కోట్లు కేటాయించారు.

=====================

బడ్జెట్ కేటాయింపులు వివరాలు ఇవే

> నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ: రూ.1,228 కోట్లు

> పాఠశాల విద్యాశాఖ: రూ. 31,805 కోట్లు

> ఉన్నత విద్య: రూ.2,506 కోట్లు

> ఎస్సీల సంక్షేమం: రూ.20,281 కోట్లు

> ఎస్టీల సంక్షేమం: రూ. 8,159 కోట్లు

> బీసీల సంక్షేమం: రూ.47,456 కోట్లు

> అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం: రూ.5,434 కోట్లు

> మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం: రూ.4,332 కోట్లు

> వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం: రూ.19,264 కోట్లు

> పంచాయతీ రాజ్ శాఖ: రూ.18,847 కోట్లు

> పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ: రూ.13,862 కోట్లు

> గృహ నిర్మాణ శాఖ: రూ.6,318 కోట్లు

> జలవనరుల శాఖ: రూ. 18,019 కోట్లు

> పరిశ్రమలు, వాణిజ్య శాఖ: రూ.3,156 కోట్లు

> ఇంధన శాఖ: రూ.13,600 కోట్లు

> ఆర్ & బి: రూ.8,785 కోట్లు

> యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖ: రూ.469 కోట్లు

> గృహ మంత్రిత్వ శాఖ: రూ.8,570 కోట్లు

> తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం: రూ.10 కోట్లు

> మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమం: రూ.10 కోట్లు

> జల్ జీవన్ మిషన్: రూ.2,800 కోట్లు

> వ్యవసాయ అనుబంధ రంగాలు: రూ.13,487 కోట్లు

> పౌరసరఫరాల శాఖ: రూ.3,806 కోట్లు

> తల్లికి వందనం: రూ. 9,407 కోట్లు (2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు)

> ఎన్టీఆర్ భరోసా పింఛన్లు: రూ.27,518 కోట్లు

> ఆర్టీజీఎస్: రూ.101 కోట్లు

> దీపం 2.0 పథకం: రూ.2,601 కోట్లు

> మత్స్యకార భరోసా: రూ.450 కోట్లు

> స్వచ్ఛాంధ్ర: రూ.820 కోట్లు

> డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం: రూ.3,486 కోట్లు

> ఆదరణ పథకం: రూ.1000 కోట్లు

=====================

AP FINANCE WEBSITE

AP BUDGET SPEECH TELUGU

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags