Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet Meeting Highlights – 06/02/2025

 

AP Cabinet Meeting Highlights – 06/02/2025

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 06/02/2025

====================

Cabinet Decisions - Press Briefing by Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public Relations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 06-02-2025 LIVE

ఏపీ క్యాబినెట్ మీటింగ్ గురించి "I &PR శాఖ మంత్రి పార్థసారథి" ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే

YouTube Link:

https://www.youtube.com/watch?v=gx1PVt3hs_4

====================

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం ‘I &PR’ శాఖ మంత్రి పార్థసారథి" ప్రెస్ మీట్ లో వివరించారు.

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే:

> వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలుపై మంత్రులతో చర్చించారు.

> ఏప్రిల్ లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు.

> అన్నదాత సుఖీభవకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

> బడులు తెరిచే నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు.

> రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగటానికి వీల్లేదని సీఎం చెప్పారు.

> వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేలోగా డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

> నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

> శాఖల పరంగా మంత్రుల పనితీరు మెరుగుపడాలని సీఎం అన్నారు.

> వాట్సప్ గవరెన్స్ కు మంచి స్పందన వస్తోంది. వివిధ పథకాల అమలు తీరుపై చేయిస్తోన్న సర్వేల్లో సానుకూల స్పందన వస్తోంది" అని అన్నారు.

====================

సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం

ఇకపై నాణ్యమైన, పోషక విలువలు కలిగి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై కేబినెట్లో చర్చ జరిగింది. మెనూలో చేసిన మార్పులపై సమావేశంలో లోకేశ్ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే విధంగా మెనూలో తీసుకొచ్చిన మార్పులను లోకేశ్ ప్రస్తావించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారాన్ని లోకేశ్ కోరారు. ఈ పథకం అమలుకు అవసరమైన నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యం పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ తెలిపారు.

====================

దస్త్రాల క్లియరెన్స్ లో ఏపీ మంత్రుల ర్యాంకులివే:

2024 డిసెంబరు వరకు దస్త్రాల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు.

మంత్రులకు సీఎం చంద్రబాబు కేటాయించిన ర్యాంకులివే..

1. ఎన్ఎండీ ఫరూఖ్

2. కందుల దుర్గేశ్

3. కొండపల్లి శ్రీనివాస్

4. నాదెండ్ల మనోహర్

5. డోలా బాలవీరాంజనేయస్వామి

6. సీఎం చంద్రబాబు

7. సత్యకుమార్

8. నారా లోకేశ్

9. బీసీ జనార్థన్ రెడ్డి

10. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

11. సవిత

12. కొల్లు రవీంద్ర

13. గొట్టిపాటి రవికుమార్

14. నారాయణ

15. టీజీ భరత్

16. ఆనం రామనారాయణరెడ్డి

17. అచ్చెన్నాయుడు

18. రాంప్రసాద్ రెడ్డి

19. గుమ్మడి సంధ్యారాణి

20. వంగలపూడి అనిత

21. అనగాని సత్యప్రసాద్

22. నిమ్మల రామానాయుడు

23. కొలుసు పార్థసారథి

24. పయ్యావుల కేశవ్

25. వాసంశెట్టి సుభాష్

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags