AP Cabinet Meeting Highlights – 15/04/2025
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 15/04/2025
===================
AP Cabinet Decisions-Press Briefing by
Hon'ble Ministers at Publicity Cell, Block-4, AP Secretariat on 15-04-2025 LIVE
ఏపీ
క్యాబినెట్ మీటింగ్ గురించి మంత్రుల ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే
YouTube Link:
https://www.youtube.com/watch?v=wdX2elD97L0&t=1842s
===================
ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రులు ప్రెస్ మీట్ లో
వివరించారు.
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే:
ఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet
Meeting) ముగిసింది. ఈ భేటీలో పలు కీలక
నిర్ణయాలు తీసుకున్నారు.
> ఎస్సీ
వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
> రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం
తెలిపింది. నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్ కు అప్పగించాలని
నిర్ణయించింది.
> స్టేట్
సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ
ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
> విశాఖలోని
ఐటీహిల్ -3 పైన టీసీఎస్ కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్
ప్రైవేట్ లిమిటెడికి 3.5 ఎకరాలు కేటాయిస్తూ
కేబినెట్ నిర్ణయం.
> ఉరుస
క్లస్టరు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని
కేటాయింపు.
> బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్
ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్ కన్సార్టియమ్ కు కూడా రాష్ట్ర
కేబినెట్ ఆమోదం.
> 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్
ఆమోదం.
> వివిధ
ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్
ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
> త్వరలోనే
డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలోగా ఉపాధ్యాయ
పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
> ఈ నెల 26న మత్స్యకార భరోసా సాయం కింద లబ్ధిదారులకు రూ.20వేలు పంపిణీ చేస్తామన్నారు.
> భూగర్భ
కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
> గుంటూరులో
ఈఎస్ఐ ఆస్పత్రికి ఉచితంగా భూమి ఇవ్వాలని నిర్ణయించారు.
> గ్రేహౌండ్స్
విభాగానికి కొత్తవలసలో భూమి కేటాయిస్తారు.
> రాష్ట్ర
వ్యాప్తంగా మంచి రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
> ఎస్సీ
ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
తెలిపారు.
> ఎస్సీ
ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలుకు కేబినెట్
నిర్ణయం తీసుకుందని చెప్పారు.
> విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు
తీసుకుంటాం.
> ఎస్సీ
ఉపవర్గీకరణ కింద గ్రూప్-1లో 12 ఉపకులాలకు 1శాతం
రిజర్వేషన్ రానుంది. > గ్రూప్-2లో 18 ఉపకులాలకు 6.5 శాతం రిజర్వేషన్ అమలు కానుంది.
> గ్రూప్-3లో 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. అన్ని జిల్లాల్లో ఈ
ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది” అని తెలిపారు.
===================
0 Komentar